Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి

గణపవరం, ఏప్రిల్ 16:
తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని గణపవరం మండల పరిధిలోని ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వీరేశలింగం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించిన వీరేశలింగం పంతులు గారు తెలుగు సమాజంలో సంస్కరణలకు పునాది వేశారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ 1881 డిసెంబర్ 15న ఆంధ్రదేశంలో తొలి పునర్వివాహాన్ని నిర్వహించడం ఆయన విశిష్ట కృషిగా నిలిచింది.
అలాగే బ్రహ్మ సమాజాన్ని స్థాపించి, 1905లో హితకారిణి సమాజం అనే సేవా సంస్థను ప్రారంభించి సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.
తెలుగు సాహిత్య రంగంలో కూడా ఆయన అపార కృషి చేశారు. తొలి తెలుగు సాంఘిక నవల “రాజశేఖర చరిత్ర”, తొలి నాటకం “వ్యవహార ధర్మబోధిని” వంటి అనేక రచనలు ఆయన ప్రతిభకు నిదర్శనం.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు వీరేశలింగం పంతులు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఆకివీడులో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొలి వార్షికోత్సవం

Arnews Telugu

భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉద్యోగిగా డి.ఎస్.ఆర్ ప్రసాద్‌కు అవార్డు

Arnews Telugu

51 వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

Arnews Telugu

బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి 

Arnews Telugu

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

Arnews Telugu