Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు

హైదరాబాద్తె : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత మరియు లొంగుబాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. శుక్రవారం హైదరాబాద్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 47 మంది మావోయిస్టులు సామూహికంగా లొంగిపోయారు.
ఈ పరిణామం దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట తెచ్చుకున్న 34 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి అత్యాధునిక తుపాకులు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన వారిలో అత్యధికులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారేనని, వారు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా తెలంగాణ పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. డిసెంబర్ 2025: 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లారాజి రెడ్డి (సంగ్రామ్), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహా రెడ్డి (గంగన్న) వంటి అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. ఏప్రిల్ రెండో వారంలో మరో 30 మంది మావోయిస్టులు ప్రధాన స్రవంతిలోకి వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో మావోయిస్టు కేడర్ కుప్పకూలుతోంది. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలని కేంద్ర హోం శాఖ నిర్దేశించిన లక్ష్యం మేరకు భద్రతా బలగాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.నిరంతర కూంబింగ్, ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో బలగాల పహారా పెరగడం.అగ్రనేతల లొంగుబాటు, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం సడలడం, అనారోగ్య సమస్యలు.ప్రభుత్వం కల్పిస్తున్న నగదు ప్రోత్సాహకాలు, భూమి మరియు ఉపాధి అవకాశాల పట్ల ఆకర్షితులవ్వడం తదితర కారణాలతో మావోయిస్టులు లొంగుబాటు బాట పుడుతున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “హింస ద్వారా ఏదీ సాధించలేమని మావోయిస్టులు గుర్తించాలి. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం. ఇంకా అడవుల్లో ఉన్నవారు తక్షణమే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి” అని పిలుపునిచ్చారు. ఈ భారీ లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టుల ఉనికి దాదాపుగా నామమాత్రంగా మారింది. ఛత్తీస్గఢ్ నుండి వచ్చి హైదరాబాద్లో లొంగిపోవడం అనేది తెలంగాణ పోలీసుల వ్యూహరచనకు నిదర్శనంగా నిలుస్తోంది.

Related posts

టీ. వి. యాంకర్ ఆత్మ హత్య – అనుమానాలు?

M HANUMATH PRASAD

రూ.కోట్లలో అవినీతి.. గురుకులాల సెక్రెటరీగా RSP ఉన్న సమయంలోనే..!

M HANUMATH PRASAD

పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం*

M HANUMATH PRASAD

ప్రపంచ సంగీత దినోత్సవ కాంపిటీషన్ లో పాల్గొన్న చిరంజీవి అభినయ శివానంద

M HANUMATH PRASAD

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద హైడ్రా కూల్చివేతలు

M HANUMATH PRASAD

చెరువు భూమిని క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. * తెలంగాణ హైకోర్టు

M HANUMATH PRASAD