Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

కాంగ్రెస్ కు అధికారం కష్టమే: చిదంబరం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని, ఆ పార్టీ కోసం చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయని మాజీ కేంద్రం మంత్రి పీ చిదంబరం అన్నారు.

2029 లోనూ ఇండియా కూటమి ప్రతిపక్ష స్థానంలోనే ఉంటుందని, ఈ విషయం రాహుల్ గాంధీ సన్నిహితులకు కూడా తెలుసని అన్నారు. రెండు ప్రధానమైన రాజ్యాంగ సంస్థలు బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయని ఆరోపించారు. అందులో మొదటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. భారత దేశంలో ఎన్నికలు జరిగితే అధికార పక్షానికి 98% ఓట్లతో ఏ పార్టీ కూడా గెలవదని అన్నారు. ఇక్కడి పరిస్థితులు వేరని చెప్పారు. ప్రతిపక్షానికి 20 నుంచి 24% ఓట్లు వస్తాయని తెలిపారు.

ఇండియా కూటమిలో లుకలుకలు

కూటమి అతుకులు కదులుతున్నట్టు, దారాలు ఊడిపోతున్నట్టు కనిపిస్తోందని చిదంబరం అన్నారు. దానిని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉందని, తిరిగి బలోపేతం చేయవచ్చని వ్యాఖ్యానించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, కీలకమైన సమావేశాలు జరగకపోవడం వంటి అంశాలపై ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు తరచూ సమావేశమవుతూ వ్యూహరచన చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ, ఇండియా కూటమిలో అలాంటి ప్రయత్నాలు కొరవడ్డాయని చిదంబరం పరోక్షంగా సూచించారు.

Related posts

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

M HANUMATH PRASAD

కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

M HANUMATH PRASAD

గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అసలేం చేసింది ?

M HANUMATH PRASAD

పీఓకేను మనం దక్కించుకోబోతున్నాం : రాజ్ నాథ్ సింగ్

M HANUMATH PRASAD

అమెరికా గెలవదు – ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం

M HANUMATH PRASAD

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు