Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాక్‌ నుంచి అఫ్గాన్‌ సరుకు ట్రక్కులకు అనుమతి

పరేషన్‌ సిందూర్‌ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో పాకిస్థాన్‌లో నిలిచిపోయిన 150 అఫ్గాన్‌ సరకు రవాణా ట్రక్కులను వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్‌ వచ్చేందుకు అనుమతించారు.

వీటిలో అధిక శాతం డ్రై ఫ్రూట్స్‌ తీసుకువచ్చేవే. ఇప్పటికే 8 ట్రక్కులు భారత్‌ చేరుకున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల పాలనలోకి వెళ్లాక తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో గురువారం ఫోన్‌లో సంభాషించారు. ఈమేరకు జైశంకర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేగాక తప్పుడు, నిరాధార వార్తలతో భారత్‌, అఫ్గానిస్థాన్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాలను తిప్పికొట్టడాన్ని స్వాగతించారు. సుదీర్ఘ కాలంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తుచేసినట్లు జైశంకర్‌ పేర్కొన్నారు.

Related posts

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD

కరాచీ ఎయిర్పోర్ట్ లో అద్వాన్న స్థితి -పాక్ నటి ఆరోపణ

M HANUMATH PRASAD

హమాస్ చీఫ్ ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్: మిస్సైళ్ల వర్షం

M HANUMATH PRASAD

మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు

M HANUMATH PRASAD

పాక్ ప్రధాని నా విలువైన మిత్రుడు :టర్కీ అధ్యక్షుడు

M HANUMATH PRASAD

భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

M HANUMATH PRASAD