Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

గృహప్రవేశం మరునాడే ఇల్లు కూల్చివేత

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్‌ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

గృహప్రవేశం చేసిన మరుసటి రోజే ఇంటిని నేలమట్టం చేయడంతో సదరు కుటుంబం రోడ్డున పడింది. వివరాలు ఇలా.. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పలు సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేతలు చేపట్టారు.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో ఉన్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కూల్చివేస్తున్నట్టు పైకి చెప్తున్నా.. ఇందులో రాజకీయ జోక్యం ఉన్నట్టు తెలుస్తున్నది. సర్వే నంబర్‌ 947లో గృహ ప్రవేశం చేసిన ఇంటితో సహా 10 ఇండ్లను అధికారులు కూల్చివేశారు. అందులో ఐలాపూర్‌ మాజీ సర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు మల్లేశ్‌కు చెందిన ఇంటిని టార్గెట్‌ చేసుకొని కూల్చివేతలు చేపట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గురువారం గృహప్రవేశం చేయగా శుక్రవారం ఇంటిని నేలమట్టం చేయడంతో మల్లేశ్‌ కన్నీరుపెట్టుకున్నారు.

తనపట్ల కక్షగట్టి, కాంగ్రెస్‌ నాయకుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం ఏమిటని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన దశలోనే అధికారులు నిలుపుదల చేసి ఉంటే ఇంతటి భారీ నష్టం వాటిల్లేది కాదని తెలిపారు. అప్పుడు మౌనం వహించి ఇప్పుడు చర్యలు తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు చెందిన అక్రమ ఇండ్ల నిర్మాణాలు జోలికి అధికారులు వెళ్లడం లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

Related posts

అడవిలో దారి తప్పిన ఫారెస్ట్ ఆఫీసర్.. 13 రోజులైనా జాడలేదు! ఏంటా అని వెతగ్గా.. చివరికి..

M HANUMATH PRASAD

హయత్ నగర్లో కారు దగ్దం

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

M HANUMATH PRASAD

కవిత ‘పాంచజన్యం’ మేనిఫెస్టో.. ఐదు అస్త్రాలతో రాజకీయ రంగంలో సంచలనం

M HANUMATH PRASAD

బక్రీద్ పండుగను ఎలాగైనా జరుపుకోండి… గోవధ జరిగితే ఊరుకునేది లేదు… : రాజా సింగ్ హెచ్చరిక…

M HANUMATH PRASAD

యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకున్న..ప్రపంచ సుందరీమణులు

M HANUMATH PRASAD