పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన డి.ఎస్.ఆర్ ప్రసాద్ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నాడు.
ISO మరియు టాక్స్ కలెక్షన్ విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, శాఖ పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గౌరవం లభించింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు.
ఈ సందర్భంగా డి.ఎస్.ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ అవార్డు సాధనలో తోటి ఉద్యోగులు, గణపవరం గ్రామ నాయకులు, గ్రామ ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నాడు. భవిష్యత్తులో కూడా మరింత నిబద్ధతతో సేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తానని తెలిపారు.
