Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్‌ యాత్ర జూన్‌ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్‌ చంద్రమాన క్యాలెండర్‌లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్‌ యాత్ర తేదీలను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

ప్రతి ఏటా ఈ తేదీలు మారుతుంటాయి.

ఈ ఏడాది జూన్‌ 4 నుంచి నాలుగు రోజులపాటు హజ్‌ యాత్ర కొనసాగుతుంది. ఇందులో రెండో రోజు అంటే జూన్‌ 5న అరాఫత్‌ మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో హజ్‌ యాత్రికులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. మహమద్‌ ప్రవక్త చివరి ఉపన్యాసం ఇచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు. జూన్‌ 6న ఈద్‌-అల్‌-అధాను జరుపుకుంటారు. ఈసారి హజ్‌ యాత్రలో దాదాపు పది లక్షల మంది ముస్లింలు పాల్గొంటారని అంచనా.

Related posts

అతి చేస్తే మరో జలసంధిని మూసేస్తాం.. ఇంతకు మించిన సంక్షోభం చూస్తారు: అమెరికాకు

M HANUMATH PRASAD

నేపాల్ లో మళ్లీ రాచరికం డిమాండ్.. 2001లో ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపిన రాజు.. నాడు ఏం జరిగిందంటే..?

M HANUMATH PRASAD

పాకిస్థాన్‌లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలు

M HANUMATH PRASAD

పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్‌ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..

M HANUMATH PRASAD

పాక్ పై బెహ్రెయిన్ లో చెలరేగిన ఒవైసీ.. ఈ హెచ్చరిక పీక్స్!

M HANUMATH PRASAD

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి.. ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు

M HANUMATH PRASAD