Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపుణ్యక్షేత్రాలు

శబరిమలలో ఘనంగా మండల పూజ

  • శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం…

శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మణికంఠుడు దర్శనం చేసుకున్నారు.ఆలయ తంత్రి కందరారు మహేశ్ మోహనారు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహిం చారు. రాత్రి పదిగంటల సమయంలో స్వామికి పవళింపు కీర్తన హరివరాసనం ఆలపించిన అనంతరం ఆలయ ద్వారాలను లాంఛనంగా మూసివేశారు.దీంతో వార్షిక యాత్ర సీజన్లో 41 రోజుల పాటు సాగిన తొలిదశ ముగిసినట్లైంది. మకరవిలక్కు పూజల కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆయ్యప్ప ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఆ రోజు నుంచి వార్షిక యాత్ర సీజన్లో రెండో దశ మొదలవుతుంది.

Related posts

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

Arnews Telugu

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

సబ్ మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Arnews Telugu

సేవా నారీ..మహిళా విభాగం లోగోను ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

Arnews Telugu

ఎమ్ వో యూ ద్వారా తూర్పు గోదావరి జిల్లా హార్టికల్చర్ రంగంలో నూతన అధ్యాయానికి ఆవిష్కరణ – జిల్లా కలెక్టర్, కీర్తి చేకూరి

Arnews Telugu