Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేందర్ సింగ్ నాయక్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం లో 37వ జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదని, వాహనాలకు నిత్యం ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

Arnews Telugu

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu

యువత పెరుగుతున్నా.. ఉద్యోగాలే కరువు

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu