Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేందర్ సింగ్ నాయక్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం లో 37వ జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదని, వాహనాలకు నిత్యం ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్

Arnews Telugu

ఘనంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య స్కూల్ ఎనిమిదో వార్షికోత్సవం

Arnews Telugu

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu

పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యం…ఎంపీడీవో వి చంద్రశేఖర్ 

Arnews Telugu