Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

అతి తక్కువ ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రజలకు అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మి పేటలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమి మల్టీ స్పెషాలిటీ సారధ్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు పుట్టినరోజులు, పెళ్లిరోజులను పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గొర్రెల శ్రీధర్ చేస్తున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలు అభినందించదగ్గ విషయమని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో అత్యంత తక్కువ ఖర్చుతో ప్రజలకు మల్టీస్పెషలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌతమి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మంగాబాయ్ రమేష్, గౌతమి హాస్పిటల్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Related posts

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

Arnews Telugu

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Arnews Telugu

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

Arnews Telugu