Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

జర్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు(15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా.. 85మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడండ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు ఛత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ నుంచి లోధ్ ఫాల్ కు స్కూల్ బస్సులో వెళ్తున్నట్లు సమాచారం. వీరంతా పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదాన్ని చూసిన వెంటనే స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ బస్సు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. బస్సు కింద మరిన్ని మృతదేహాలు కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.బస్సులోని ప్రయాణీకులు ఛత్తీస్‌ఘడ్ లోని బలరంపూర్ జిల్లా నుంచి లేట్హార్లోని మహువాదండ్‌లో జరిగిన వివాహానికి వెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కుమార్ గౌరవ్ తెలిపారు.మృతులు.. రేసంతి దేవి (35), ప్రేమ దేవి (37), సీతా దేవి (45) సుఖ్నా భూయాన్, సోనమతి దేవి (55)గా గుర్తించారు. గాయపడిన వారిలో 85 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేక ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

Related posts

జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం.

Arnews Telugu

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

Arnews Telugu

కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్

Arnews Telugu

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu

ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్

Arnews Telugu