Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల అనర్హత ఏరివేత ప్రారంభం

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల ఏరివేత ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగులు ₹6,000 పెన్షన్ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా కొందరు ఈ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది.

అనర్హుల తొలగింపు

🔹 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేసి దివ్యాంగ పెన్షన్ ఇస్తుంది.
🔹 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు ఇకపై ఈ పథకానికి అర్హులు కారు.
🔹 తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న దివ్యాంగులకు మాత్రం ప్రభుత్వం ₹15,000 పెన్షన్ ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు లేవని తేలితే వారికి కేవలం ₹6,000 దివ్యాంగ పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది.
🔹 వృద్ధ దివ్యాంగులకు వైకల్యం లేదని తేలితే, వారిని వృద్ధాప్య పెన్షన్ కింద మార్చనుంది.

సచివాలయాల ద్వారా నోటీసులు

👉 ఈరోజు నుంచి ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుంది.
👉 అనర్హతగా తేలిన వారికి పెన్షన్ రద్దు ఉత్తర్వులు కూడా అందజేయబడతాయి.
👉 ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుంది.

అపీల్ చేసే అవకాశం

అర్హత ఉన్నప్పటికీ అనర్హతగా తేలితే, ఆ వ్యక్తులకు అపీల్ చేసుకునే అవకాశం కల్పించింది.

కొత్త సదరం కార్డులు

🔹 తనిఖీల అనంతరం నిజంగా అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త సదరం కార్డులు జారీ చేస్తుంది.
🔹 పెన్షన్ అనర్హత నోటీసు అందుకున్న వారు మరిన్ని వివరాలకు తమ గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించాలి

Related posts

స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ చాటిన గురుకులం విద్యార్థులు*

Arnews Telugu

తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన

Arnews Telugu

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

Arnews Telugu

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకపోవడం బాధాకరం – దండగ సర్పంచ్ పిల్లా: రాంబాబు

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

Arnews Telugu

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu