Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిల్లులు కోసం కత్తి దాడి… చివరకు ఏమైంది అంటే

బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ (25) అదే కాలనీలో నివాసముండే బాజీ (50) అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు.. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత తాను ఇచ్చిన రెండు పిల్లి పిల్లలకు సంబంధించి డబ్బు ఇవ్వమని షేక్ బాజీ.. పిల్లులను తీసుకున్న వ్యక్తిని అడిగాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇది కాస్త చినికి చినికి గాలి వానలా మారి ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో పిల్లులను తీసుకున్న ఎస్కే బాజీ కత్తితో.. షేక్ బాజీ ఇంటికి వెళ్లి బెదిరించాడు. ఈ ఘర్షణలో బాజీని పొట్టలో కత్తితో పొడిచాడు ఎస్కే బాజీ.. దీంతో అతనికి తీవ్ర గాయమైంది.. తీవ్ర రక్త స్రావంతో గాయపడిన షేక్ బాజీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇదిలాఉంటే.. కత్తితో దాడి చేసిన బాజీ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి షేక్ బాజీ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Related posts

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

Arnews Telugu

ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా… దర్శిపర్రు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

Arnews Telugu

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

AR NEWS TELUGU

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu