Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యం…ఎంపీడీవో వి చంద్రశేఖర్ 

 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలంతా ఆరోగ్య జీవనం సాగించవచ్చని తాడేపల్లిగూడెం ఎంపీడీవో వి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బహిరంగ మలమూత్ర విసర్జన మనేధం మరుగుదొడ్లను వాడదామని నినాదంతో గ్రామంలో పెద్దలు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంపీడీవో వి చంద్రశేఖర్ గ్రామంలోని సామూహిక మరుగుదొడ్లను పరిశీలించి అక్కడ మరుగుదొడ్లు వాడుతున్న వారి వివరాలు సేకరించి అవసరమైతే వ్యక్తిగత మరుగుదొడ్లు అందించాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి కొన్ని మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ రఘునాధ రాజు, ఎం ఆర్ సి ఎం రవి కిరణ్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు

Related posts

గురువు కరిబండి రామకృష్ణకు ఘన సత్కారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ప్రదానం చేసిన కలెక్టర్ నాగరాణి

Arnews Telugu

విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలి.. డిఈఓ నారాయణ

Arnews Telugu

ప.గో: వైసీపీ సమావేశానికి కొట్టు సత్యనారాయణ దూరం – రాజకీయ వర్గాల్లో చర్చ

Arnews Telugu

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

Arnews Telugu

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

Arnews Telugu

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu