Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

తాడేపల్లిగూడెం, ఆగస్టు 20:

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతిభావంతులు పాల్గొననున్నారని యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరిబండి రామకృష్ణ తెలిపారు.

బుధవారం అలంపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ –
“మునుపటి పోటీల్లో బంగారు పతకాలు సాధించిన యోగా క్రీడాకారులు ఈ సారి కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన వారికి జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది” అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ –

క్రీడాకారుల కోసం నివాసం, ఆహారం, భద్రత, మెడికల్ సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేశామని

స్థానిక ప్రజలు, యాజమాన్యం కూడా పోటీల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారని

విద్యార్థులు యోగాసనాలను అభ్యసించడం వలన శారీరక – మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన వెంట త్రిమూర్తులు కూడా పాల్గొన్నారు.
పోటీల్లో విభిన్న వయసు విభాగాలు (అబ్బాయిలు – అమ్మాయిలు వేర్వేరుగా) ఉంటాయని, ప్రతిభ కనబరచిన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

Related posts

జనసేన సిద్ధాంతాలపట్ల నిబద్ధత ముఖ్యం..ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం

Arnews Telugu

విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలి.. డిఈఓ నారాయణ

Arnews Telugu

తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ

Arnews Telugu

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu

కూలీ ఇంట్లో కోటిన్నర

Arnews Telugu