గ్రామ అభివృద్ధిలో భాగంగానే పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోలను శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి మట్టి పేరుకుపోయి దుర్వాసన కొడుతున్న చెరువును అభివృద్ధి చేసేందుకే పంచాయతీ తీర్మానం చేసినట్లు తెలిపారు. చెరువులోన మట్టిని స్మశాన వాటిక పూడిక కోసం, శివాలయ అభివృద్ధికి ఇతర ప్రభుత్వ స్థలాలు మెరక చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఏళ్ల తరబడి స్మశాన వాటిక ఎర్ర కాలువ వరద నీటిలోనే నానేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండపల్లి భగవాన్, అడపా విష్ణు, మాజీ సర్పంచ్ కొండపల్లి నగేష్, శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొండపల్లి ఇంద్ర శీను, తదితరులు పాల్గొన్నారు.
