Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంరాజకీయం

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

మాజీ మంత్రులు జోగి రమేష్ ,అంబటి రాంబాబు పై కూటమి వర్గాల తీరును గూడెం వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం తాడేపల్లిగూడెం పట్టణ కొబ్బరి తోట ప్రాంతంలో వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు గుండు మోగుల నాగు, వైసిపి మాజీ పట్టణ యూత్ ప్రెసిడెంట్ చిటకన ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగుతుందన్నారు గతంలో రాష్ట్రానికి మంత్రులుగా చేసిన ప్రజా ప్రతినిధులు ఆస్తులపై అల్లరి మూకలు దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఏ ప్రభుత్వం పాలనలో ఉన్న ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగాలని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పాడయ్యే విధంగా వ్యవహరించకూడదని అన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారాన్ని తెరమీదకి తీసుకువచ్చి ప్రజల్లో వైసిపి పార్టీని చులకన చేయాలని భావనతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు మన దేశంతో పాటు అనేక దేశాల ప్రజలు అత్యధిక మంది తిరుమల శ్రీనివాసుని కొలుస్తారని వారు మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎటువంటి జంతు అవశేషాలు లడ్డులో లేవని తెలిపారని అన్నారు ఫ్లెక్సీలు వ్యవహారంలో అంబటి ప్రశ్నించడానికి వెళితే ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తే ఆవేశాలు పెరిగి అక్కడ ఉన్న వారిని మాత్రమే దుర్భాషలాడేరు తప్ప చంద్రబాబు నాయుడును కాదని అంబటి కూడా తెలిపినట్టుగా వారు అన్నారు దాడిని ఖండిస్తూ మనం జనారణ్యంలో ఉన్నామే గాని వనరణ్యం లో లేమని అన్నారు మనుషులుగా పుట్టిన మనమంతా మానవత దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉండొచ్చు తరువాత ప్రభుత్వం మారొచ్చు కానీ ఎవరైనా ప్రజా క్షేత్రంలో హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు చిటకన ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలు ఆ పార్టీకి వెన్నుముక అని అంటారని మరి బిసి మంత్రి అయినా జోగి రమేష్ పై దాడినీ తన ఒక బీసీ వర్గానికి చెందిన వాడిగా తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు ప్రతి బీసీ సోదరుడిని కలిసి మేము జోగి రమేష్ కు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో స, వెలనాటి సత్తిబాబు, కట్ట నాగరాజు,బత్తిని గణేష్,ఉదయ్ భాస్కర్, సుచిత్ర రెడ్డి, కాశీ విశ్వనాథ్ ,బుల్లి ఎంకన్న, చిటకన కృష్ణ, , ఫ్లెక్సీ రాజు లింగారెడ్డి గూడెం వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

సబ్ మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Arnews Telugu

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu

పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*

Arnews Telugu

వంగవీటి రంగా అజరామరుడు – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

కూలీ ఇంట్లో కోటిన్నర

Arnews Telugu