Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

జగన్ మనసులో కొట్టు స్థానం పదిలం.

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారు అనే వార్తలకు భీమవరం లో కళ్లెం పడింది. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అయ్యారు, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలికేందుకు ముందుకు వెళ్లారు, ఈ నేపథ్యంలో మాజీ డిప్యుటీ సీఎం, వైసీపీ పిఎసి మెంబర్ కొట్టు సత్యనారాయణ వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు, అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు కొట్టు సత్యనారాయణ వివాహ వేదిక పైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు, ఫోటో దిగేందుకు దూరంగా ఉన్న కొట్టు సత్యనారాయణను దగ్గరికి రా అన్న అని పిలవడం చుస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొట్టు స్థానం పదిలంగా ఉందని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వివాహానికి హాజరైనప్పటి నుంచి వెళ్లేటప్పుడు వరకు మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ వెంటే ఉండడం, ఇరువురి మధ్య ఆప్యాయతలు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తుల్లో కొట్టు సత్యనారాయణ ఒకరు అని భీమవరం వివాహ వేడుకల్లో తేటతెల్లమైంది.

Related posts

ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

Arnews Telugu

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

Arnews Telugu

కూలీ ఇంట్లో కోటిన్నర

Arnews Telugu

విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలి.. డిఈఓ నారాయణ

Arnews Telugu

వీధుల్లో ఒక్క కుక్క ఉండకూడదు – వెంటనే షెల్టర్లకు తరలించండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Arnews Telugu

తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో కల్వరి టెంపుల్ ప్రారంభానికి సర్వం సిద్ధం

Arnews Telugu