Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

గణపవరం ఎం.ఇ.ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం

గణపవరం ఎం.ఇ.ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండల విద్యా కేంద్రంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, భీమవరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి శ్రీ పి.జె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గణపవరం ఎంఆర్ఓ శ్రీ ఐ. అప్పారావు శిబిరాన్ని సందర్శించి, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.
ఈ రక్తదాన శిబిరంలో చల్లా కృష్ణ, ఓ. శ్రీనివాస్, మద్దాల వెంకటేశ్వర్లు, జి. రామాంజనేయులు, ఎం.ఎస్.ఎల్.ఎస్.ఎస్.ఎన్ నారాయణ, బి. కిషోర్ బాబు, పంపన శ్రీనివాస్, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల జూనియర్ అసిస్టెంట్ కృష్ణ, కిడ్స్ క్యాస్టల్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు రక్తదానం చేశారు.
కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి. వీరవేణి, రామాంజనేయులు, తోట సింహాద్రి అప్పారావు, అలాగే ఉపాధ్యాయులు బి. రమేష్, హెచ్‌ఎస్‌వీవీ ఆంజనేయులు మరియు పి.ఈ.టి లు పాల్గొన్నారు.
ఈ శిబిరం సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తూ, రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది.

Related posts

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

ఘనంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య స్కూల్ ఎనిమిదో వార్షికోత్సవం

Arnews Telugu

కూటమి ప్రభుత్వ పాలన అరాచకంగా మారింది: వడ్డి రఘురామ్ నాయుడు

Arnews Telugu

జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం.

Arnews Telugu

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu

బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి 

Arnews Telugu