Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*

గ్రామ అభివృద్ధిలో భాగంగానే పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోలను శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి మట్టి పేరుకుపోయి దుర్వాసన కొడుతున్న చెరువును అభివృద్ధి చేసేందుకే పంచాయతీ తీర్మానం చేసినట్లు తెలిపారు. చెరువులోన మట్టిని స్మశాన వాటిక పూడిక కోసం, శివాలయ అభివృద్ధికి ఇతర ప్రభుత్వ స్థలాలు మెరక చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఏళ్ల తరబడి స్మశాన వాటిక ఎర్ర కాలువ వరద నీటిలోనే నానేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండపల్లి భగవాన్, అడపా విష్ణు, మాజీ సర్పంచ్ కొండపల్లి నగేష్, శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొండపల్లి ఇంద్ర శీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu

భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉద్యోగిగా డి.ఎస్.ఆర్ ప్రసాద్‌కు అవార్డు

Arnews Telugu

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu

కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి

Arnews Telugu