ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు
*ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు
*విద్యతోపాటు కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామాజిక సేవలు అమూల్యం
ఉంగుటూరు జనవరి 10
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు
కార్మెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 34 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా కార్మిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యతోపాటు అనేక సామాజిక కార్యక్రమాలలో ముందున్నారని కొనియాడారు ఈ స్కూలు నుండి విద్యను అభ్యసించిన వారు ఎందరో ఉన్నతమైన స్థానాలకు ఎదిగారని తెలిపారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ఆ కలలను సాధించాలని పిలుపునిచ్చారు ఈనాటి విద్యార్థులే రేపటి భావిభారత దేశానికి దిక్సూచులని అన్నారు కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులకు రాయితీ ఇవ్వడం , పేదలకు నిత్య అవసరాలు అందించడం, అనారోగ్యం తో ఉన్నవారికి ఆర్ధిక సహాయం అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు ను ఆయన అభినందించారు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీవా ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసిస్తున్నారని ఆమెను కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్య కళ కార్యక్రమాలు కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా కార్మెల్ సంస్థ ప్రెసిడెంట్ సిస్టర్ మరియా అగస్టిన్ ,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సిస్టర్ సారూప్య , ఉప విద్యాశాఖ అధికారి రవీంద్ర భారతి చేబ్రోలు ప్రెసిడెంట్ రాందే లక్ష్మీ సునీత రాజారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
