Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం బుధవారం శాంతి ర్యాలీ జరిగింది. జి.వి. మాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్‌టిఆర్ సెంటర్ వరకు కొనసాగింది.

ప్రతి ఏడాది జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈసారి కూడా పట్టణ ప్రజలు, విద్యార్థులు, సంస్థ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, మానవత విలువల పెంపు, సమాజంలో ఐకమత్యం కోసం శాంతి ర్యాలీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పట్టణ పోలీసు సిబ్బంది ర్యాలీకి సహకరించగా, షిరిడీ సాయి స్కూల్ విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. మానవత సంస్థకు చెందిన అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్‌తో పాటు పలువురు సభ్యులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి శాంతి ర్యాలీలను నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మానవత సంస్థ అధ్యక్షులు జినపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిశోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, పైడికొండల సింధు, జంగా రామ్ రాయ్, షిరిడీ సాయి స్కూల్ అధినేత యెగ్గిన శరత్ బాబు, చేకూరి బంగార్రాజు, బురిడి సతీష్, LIC పాండురంగరావు, బి.హరి కుమార్, కర్రీ రాజరావు, రామకృష్ణ, సాయి మోహన్, కె.కృష్ణకాంత్, పి.కుమార స్వామి, బి.అరుణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జనసేన సిద్ధాంతాలపట్ల నిబద్ధత ముఖ్యం..ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

AR NEWS TELUGU

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu

స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu