Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లావిద్య

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో పిజీ మరియు పి.హెచ్.డి కోర్సుల్లో 2025-26 సంవత్సరమునకు ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది అని రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు. డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ ఉద్యాన కళాశాల ప్రవేశము కొరకు ఇంతకు ముందు నమోదు చేసుకున్న దరఖాస్తు దారులకు ది. 17-12-2025 న పిజి కోర్సులకు మరియు 18-12-2025 తేదీన పి.హెచ్.డి కోర్సులకు మాన్యూవల్ గా కౌన్సెలింగ్ ను డా.వై. ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాల, వెంకటరామన్నగూడెం నందు కౌన్సెలింగ్ కి ఏర్పాటు చేశారు. అర్హత కలిగిన విద్యార్థులు స్వయంగా తగిన ధృవపత్రాలతో వచ్చి కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సిందిగా ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు. కౌన్సెలింగ్ లో సీట్ పొందిన వారు వెంటనే వారికి కేటాయించిన ఆయా కళాశాలల్లో చేరవలసి ఉంటుందని తెలియజేశారు. ఇతర వివరములకు https://drysthu.ap.gov.in/ చూడగలరు మరింత సమాచారం కోసం ఈ నంబర్లకు 8008263212 మరియు 7382633648. సంప్రదించాలి అని కోరారు.

Related posts

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి

Arnews Telugu

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu