Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం

27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం
తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
27వ వార్డులోని రామాలయం, స్థానిక బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, బలుసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ సభ్యులు అంజి ఆధ్వర్యంలో మహిళలకు గాజులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీనివాస్, 27వ వార్డు ప్రెసిడెంట్ నాని పాల్గొన్నారు.
అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెం: 64 ఏళ్ల చరిత్ర గల ఆఫీసర్స్ క్లబ్ కూల్చివేత

Arnews Telugu

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

Arnews Telugu

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500

Arnews Telugu