ఏపీలో దివ్యాంగ పెన్షన్ల ఏరివేత ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగులు ₹6,000 పెన్షన్ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా కొందరు ఈ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది.
అనర్హుల తొలగింపు
🔹 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేసి దివ్యాంగ పెన్షన్ ఇస్తుంది.
🔹 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు ఇకపై ఈ పథకానికి అర్హులు కారు.
🔹 తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న దివ్యాంగులకు మాత్రం ప్రభుత్వం ₹15,000 పెన్షన్ ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు లేవని తేలితే వారికి కేవలం ₹6,000 దివ్యాంగ పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది.
🔹 వృద్ధ దివ్యాంగులకు వైకల్యం లేదని తేలితే, వారిని వృద్ధాప్య పెన్షన్ కింద మార్చనుంది.
సచివాలయాల ద్వారా నోటీసులు
👉 ఈరోజు నుంచి ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుంది.
👉 అనర్హతగా తేలిన వారికి పెన్షన్ రద్దు ఉత్తర్వులు కూడా అందజేయబడతాయి.
👉 ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుంది.
అపీల్ చేసే అవకాశం
అర్హత ఉన్నప్పటికీ అనర్హతగా తేలితే, ఆ వ్యక్తులకు అపీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
కొత్త సదరం కార్డులు
🔹 తనిఖీల అనంతరం నిజంగా అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త సదరం కార్డులు జారీ చేస్తుంది.
🔹 పెన్షన్ అనర్హత నోటీసు అందుకున్న వారు మరిన్ని వివరాలకు తమ గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించాలి
