మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారు అనే వార్తలకు భీమవరం లో కళ్లెం పడింది. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అయ్యారు, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలికేందుకు ముందుకు వెళ్లారు, ఈ నేపథ్యంలో మాజీ డిప్యుటీ సీఎం, వైసీపీ పిఎసి మెంబర్ కొట్టు సత్యనారాయణ వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు, అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు కొట్టు సత్యనారాయణ వివాహ వేదిక పైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు, ఫోటో దిగేందుకు దూరంగా ఉన్న కొట్టు సత్యనారాయణను దగ్గరికి రా అన్న అని పిలవడం చుస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొట్టు స్థానం పదిలంగా ఉందని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వివాహానికి హాజరైనప్పటి నుంచి వెళ్లేటప్పుడు వరకు మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ వెంటే ఉండడం, ఇరువురి మధ్య ఆప్యాయతలు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తుల్లో కొట్టు సత్యనారాయణ ఒకరు అని భీమవరం వివాహ వేడుకల్లో తేటతెల్లమైంది.
