గణపవరం / భీమవరం, ఏప్రిల్ 21:
జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని గణపవరం డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.
మంగళవారం భీమవరంలోని పీజీటీఆర్ఎస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
ప్రభుత్వ విధుల నిర్వహణలో నిబద్ధతతో, సమర్థతతో పని చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సత్యనారాయణను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సేవలో ఆయన చూపిన కృషి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
previous post
